సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో పెద్దకడబూరు వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ పదవికి పురుషోత్తం రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని వ్యవసాయ శాఖ కమీషనర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఇంతవరకు తనకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పురుషోత్తం రెడ్డి తెలిపారు.