కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

50చూసినవారు
పాణ్యం నియోజకవర్గంలోని కొత్తూరు సుబ్బరాయుడు ఆలయంలో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పొటెత్తారు. స్వామివారికి భాద్రపద మాసం, శుక్రవారం పంచామృతాభిషేకం, పాలాభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం, అర్చనలు వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో అభిషేకం అనంతరం మంత్రపూర్వకంగా నివేదన సమర్పించారు. వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్