గడివేముల మండలంలోని బిలకల గూడూరు గ్రామంలో శనివారం నాడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వైసిపి నాయకుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల ప్లస్ పథకాల గురించి వివరిస్తూ ఎన్నికల్లో వైసిపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.