వరద బాధితులకు 10 వేల కిట్లు

75చూసినవారు
వరద బాధితులకు 10 వేల కిట్లు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం 10 వేల నిత్యావసర సరుకుల కిట్లతో వాహనాలు బయలుదేరినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా టీడీపీ తరఫున వరద బాధితుల సహాయార్థం రూ. 1. 50 కోట్లు విలువ చేసే 10 వేల నిత్యావసర సరుకుల కిట్లతో వాహనాలను ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించి, మాట్లాడారు. ఒక కుటుంబానికి పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్