నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

69చూసినవారు
అధిక వర్షాల వల్ల నష్టపోయిన పచ్చి మిర్చి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి, దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని వెల్దుర్తిలో సీపీఐ మండల కార్యదర్శి టి. కృష్ణ, రైతు సంఘం కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు. గురువారం రామళ్లకోటలో మాట్లాడారు. మండలంలో పచ్చి మిర్చి ఎక్కువగా పండిస్తున్నారని, పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్