నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

3334చూసినవారు
నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత
శ్రీశైల క్షేత్రంలో వెలసిన మల్లికార్జున స్వామి స్పర్శ దర్శన సేవను శని, ఆది, సోమవారాల్లో నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఈ మూడు రోజుల్లో ఉచిత స్పర్శ దర్శన సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్