భారతరాజ్యాంగ నిర్మాత డా బీఆర్అంబేడ్కర్ 133వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవకమిటి కన్వీనర్ ఎస్ దేవసహాయం, చైర్మన్ మాల ఉసేనలు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మిగనూరులోని కేవీపీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవ కరపత్రాలను వారు విడుదల చేశారు.