వృద్ధులకు పెన్షన్ కష్టాలు
ఎమ్మిగనూరులో మూడో రోజు పెన్షన్దారుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల ఫించన్ నగదును రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ఖాతాల్లో డబ్బులు తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకులకు బారులు తీరారు. మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారంటూ శుక్రవారం పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ కాని లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.