హిమోఫిలియా వ్యాధిగ్రస్తులకు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితుల కోసం బ్రిటన్ ప్రభుత్వం 1970లో ప్లాస్మా చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి ఫ్యాక్టర్ VIII పేరుతో ల్యాబ్లో తయారైన కృత్రిమ రక్తాన్ని అమెరికా నుంచి బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ దిగుమతి చేసుకుంది. ఈ చికిత్స ద్వారా వేలాది మంది బాధితులకు రక్తం అందించారు. అయితే.. ఈ చికిత్స తర్వాత అనేక మందిలో దుష్ప్రభావాలు షురూ అయ్యాయి.