రాజస్థాన్లోని జైపూర్లో షాకింగ్ ఘటన జరిగింది. హిమ్మత్ సింగ్ అనే వ్యక్తి మే 5 రాత్రి తన ఇంటి వద్ద ఎప్పటిలాగే కార్ పార్క్ చేశాడు. దానిని దుండగులు దొంగిలించారు. అనంతరం మే 9న తన ఫ్రెండ్తో కలిసి రోడ్డుపై వెళ్తుండగా అతడికి తన కారు కనిపించింది. కారులోని వారిని నిలదీయగా వారు ఎదురుతిరిగారు. హిమ్మత్తో పాటు అతడి ఫ్రెండ్ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లారు. పోలీసులకు భయపడి మంగళవారం కారును వదిలేశారు.