AP: అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే బాల అమృతంలో మార్పులు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. మరిన్ని పోషకాలతో బాల అమృతం అందించనున్నారు. ముందుగా బాల అమృతం, పాలలో మార్పులు చేస్తున్నారు. పాలకు బదులుగా పాలపొడి అందించాలని నిర్ణయించారు. మార్పులు, చేర్పులపై నెల రోజులపాటు తల్లిదండ్రులు, చిన్నారుల అభిప్రాయాలు తీసుకోనున్నారు.