ఆత్మకూరు పట్టణంలో గురువారం జనసేన నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ. వైసీపీ కోవర్ట్ మనుక్రాంత్ రెడ్డి, తన సొంత గూటికి చేరడం నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి మంచి శుభ పరిణామన్నారు. గత ఆరు సంవత్సరాలుగా వైసీపీ ముసుగులో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని మనుక్రాంత్ రెడ్డి నాశనం చేశాడని ఆరోపించారు.