గూడూరు పెద్ద మసీదువీధిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిమళ వెంకటేశ్వర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతున్నాయన్నారు. మైనారిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులకు పార్లమెంటులో టీడీపీ, వైసీపీలు మద్దతిచ్చాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.