కందుకూరు మండల పరిధిలోని మాచవరం గ్రామంలోని యానాది సంఘం లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ జనసేనకు చెందిన నరసింహ అనే యువకుడు దుర్మరణంపాలైన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈనెల 12న అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నరసింహ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్తు తీగలు తగిలి మృతి చెందటంతో గ్రామంలో నరసింహా కుటుంబంలో విషాదం నెలకొంది.