బాధితుల వివరాలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలి

74చూసినవారు
బాధితుల వివరాలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలి
కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ ముంపు ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా పర్యటించారు. వరదల కారణంగా నష్టపోయిన వారి వివరాలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివరాలు సేకరించడమే ఆలస్యమైతే ఇక నష్టపరిహారం ఎప్పుడు ఇవ్వాలని అన్నారు. బాధితులకు నాణ్యతతో కూడిన భోజనం మూడు పూట్ల అందే విధంగా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్