నెల్లూరు జిల్లాలో గత మూడు రోజులుగా వర్షం కురుస్తుంది. ఇందుకూరు పేట మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఎండ కాసింది. మధ్యాహ్నం నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ వర్షం ఒకటేసారి వచ్చాయి. దీంతో రోజు పనులకు వెళ్లే కూలీలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆకాశంలో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. చూపరులను బాగా ఆకట్టుకున్నది. చూపరులు ఇంద్రధనస్సును తమ ఫోన్ లో బంధించారు.