కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురువారం కొడవలూరు మండలంలో పర్యటించారు. మండలంలోని రాజుపాలెం గ్రామంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై విమర్శలు చేశారు. నెల్లూరు అభ్యర్థిగా ముస్లింను నిలబెట్టినందుకు వేమిరెడ్డి వైసీపీని వీడారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.