నందమూరి బాలకృష్ణ కు స్వాగతం పలికిన విపిఆర్

68చూసినవారు
నందమూరి బాలకృష్ణ కు స్వాగతం పలికిన విపిఆర్
కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో పాల్గొనేందుకు కావలి విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ కి నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. కావలిలోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో హెలికాప్టర్లో దిగిన బాలకృష్ణ ని విపిఆర్ కలిశారు. అనంతరం వారి ఇరువురు గుడ్లూరు సభ వేదిక వద్దకు బయలుదేరారు. బాలకృష్ణ ని కలిసిన వారిలో కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్