విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీ, బడంకాయ గుంట ఎస్ టి కాలనీలో మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. కాలనీలో మహిళలు వంట చేసుకుంటూ ఉండగా గాలికి రెండు పూరి గుడిసేలు తగులుకుని అగ్ని ప్రమాదం జరిగింది. అవి పూర్తిగా కాలిపోయాయి. రెండు గుడిసెలు కాలిపోగా వాటి ఆస్తి నష్టం సుమారుగా రెండు లక్షల రూపాయలు ఉంటుందని బాధితులు తెలిపారు. బాధితులు ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు.