రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ కు తీవ్ర గాయాలు

1542చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ కు తీవ్ర గాయాలు
దొరవారిసత్రం మండలం, నెలబల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి పై బుధవారం సాయంత్రం ఆగి ఉన్న లారీని వెనకనుండి బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ఫొటోగ్రాఫర్లు గాయపడటం జరిగింది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నాయుడుపేటకు ఓ కార్యక్రమానికి వెళుతున్న సమయంలో లారీని డీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. జాతీయరహదారి పై అనుమతి లేని చోట రోడ్ల ప్రక్కనే లారీలు నిలపడం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్