మేనిఫెస్టో ఆవిష్కరించిన దుత్తలూరు కూటమి నాయకులు

62చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండల కేంద్రంలో స్థానిక తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ నాయకులు గురువారం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి మేనిఫెస్టో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, పేద, బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేశారన్నారు. ఈ మేనిఫెస్టో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్