జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల

52చూసినవారు
ఉదయగిరి నుంచి హైదరాబాద్ బిహెచ్ఇఎల్ వరకు గురువారం 2 నూతన బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నుంచి ఎందరో చదువులు, ఉద్యోగాలు, పనుల నిమిత్తం హైదరాబాద్ వెళుతుంటారని వారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉదయగిరి ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్