వలంటీర్ల రాజీనామా

1076చూసినవారు
వలంటీర్ల రాజీనామా
సైదాపురం మండలంలోని చాగణం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న 15 మంది వలంటీర్లు శనివారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను పంచాయతీ కార్యదర్శి సుమలతకు అందజేశారు. వలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు నిత్యం సేవ చేసే తమ పట్ల ప్రతి పక్ష పార్టీలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని తెలిపారు. దీంతో మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్