రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో రోడ్ షో నిర్వహించిన పిన్నెల్లి రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వంతోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.