కూటమి ప్రభుత్వంతో ప్రజలకు మంచి రోజులు

57చూసినవారు
కూటమి ప్రభుత్వంతో ప్రజలకు మంచి రోజులు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో ప్రజలకు మంచి రోజులు వచ్చాయని మాజీ మంత్రి, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సభ్యురాలు పడాల అరుణ అన్నారు. శుక్రవారం సాయంత్రం తన స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ వంద రోజుల్లో ప్రజలు మెచ్చే రీతిలో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో గజపతినగరం మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు (జగన్), దుర్గాప్రసాద్, త్రివేది, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్