గజపతినగరం: చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

61చూసినవారు
బొండపల్లి మండలంలోని గొట్లాం జ్యువెలరీ షాపులో చోరీ జరిగిన కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్, సుల్తాన్ మోగియాలను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు బొబ్బిలి డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. ఈసందర్భంగా ఆయన బొండపల్లిలో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి మరి కొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. పట్టబడిన వారి నుంచి అరకిలో వెండి, చోరీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్