హై లెవెల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కలెక్టర్

57చూసినవారు
హై లెవెల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కలెక్టర్
మన్యం జిల్లాలో గల పాచిపెంట మండలంలో కుంటాం - తుమ్మగుడ్డి రహదారిలో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. మెట్టగుడ్డి మీదుగా రూ. 5. 75 కోట్లుతో రహదారి నిర్మాణం జరుగుతోంది. పనుల నాణ్యత, వివిధ అంశాల్లో జరగాల్సిన పనుల వివరాలను పరిశీలించారు. కొద్ది రోజుల్లో వర్షాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉంటాయని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్