సాధారణ ఎన్నికల్లో భాగంగా కురుపాం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి తన ఓటు హక్కును జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో సోమవారం వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.