పోతంపేటలో ఘనంగా దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాలు

73చూసినవారు
పోతంపేటలో ఘనంగా దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాలు
లక్కవరపుకోట మండలంలో చివారి గ్రామమైన పోతంపేటలో శ్రీ దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం గణపతి పూజ మండపారాధన, కలశారాధన ప్రతిష్ట కార్యక్రమం జరిగాయి. అలాగే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో గ్రామ ప్రజలకు దర్శనం ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతాయని ఆలయ కమిటీ మెంబర్ పెదిరెడ్ల కనకేశ్వరరావు, భీమరాజు సంతోష్ కుమార్, లంక రామారావు తదితర సభ్యులందరూ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్