ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చైనాలో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో చైనాలోని యునాన్ ప్రావిన్స్లో ఉన్న ఓ పిల్లల ఆస్పత్రిలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ సమయంలో ఆరుగురు నవజాత వార్డులో ఉన్నారు. ప్రకంపనలు తీవ్రత పెరుగుతున్నా కూడా అక్కడున్న సిబ్బంది భయంతో పారిపోలేదు. అక్కడే ఉండి శిశువులను కాపాడేందుకు యత్నించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.