పిన్నెల్లికి ఏడేళ్లు శిక్ష పడే అవకాశం: సీఈవో

64చూసినవారు
పిన్నెల్లికి ఏడేళ్లు శిక్ష పడే అవకాశం: సీఈవో
AP: మాచ‌ర్ల‌లో ఈవీఎం ధ్వంసం కేసులో మాచ‌ర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పోలీసులు A1గా చేర్చిన‌ట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. "10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు." అని సీఈవో స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్