గిద్దలూరు: ప్రపంచ తెలుగు సాహితీ కళాజాతరకు మార్టిన్ లూథర్ కు ఆహ్వానం

75చూసినవారు
గిద్దలూరు: ప్రపంచ తెలుగు సాహితీ కళాజాతరకు మార్టిన్ లూథర్ కు ఆహ్వానం
అంతర్జాతీయ ప్రమాణాలు గల సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో.. తాడేపల్లిగూడెం నందు ఈనెల 19, 20 తేదీలలో 24 గంటల పాటు ఏకధాటిగా జరిగే ప్రపంచ తెలుగు సాహితీ కళాజాతర కార్యక్రమానికి పాల్గొనేందుకు పాపినేనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులు మార్టిన్ లూథర్ కు ఈ కళాజాతరలో కవితా గానం చేయుటకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కవులు, కళాకారులు తమ సాహితీ ప్రక్రియలను ప్రదర్శించనున్నారు.

సంబంధిత పోస్ట్