ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన కోఆర్డినేటర్

55చూసినవారు
కనిగిరి లోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను జిల్లా ప్రభుత్వ వైద్యశాలల కోఆర్డినేటర్ శేషు కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లకు చాలా కాలం నుండి ఆహారం ఇవ్వడం లేదని, సిబ్బంది, వైద్యుల కొరత ఉందని ఈ సందర్భంగా శేషు కుమార్ గుర్తించారు. నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని శేషు కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్