కనిగిరి పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ నెల 23న జరిగే హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం గురించి చర్చించారు. గతేడాది కంటే రెట్టింపు ఉత్సాహంతో వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.