రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

50చూసినవారు
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ సంఘటన కంభం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో గురువారం జరిగింది. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు విషమంగా ఉన్న వ్యక్తిని ఒంగోలుకు తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్