ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

85చూసినవారు
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
అద్దంకి పట్టణం సాయిబాబా గుడి వెనుక నివసించే లక్ష్మీనారాయణ అనే యువకుడు బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లింగ సముద్రం మండలం తిమ్మారెడ్డిపాలేనికి చెందిన ఇతను అద్దంకిలో టీ దుకాణాల్లో పనిచేస్తుంటాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న లక్ష్మీనారాయణ ఒక్కడే అద్దె ఇంట్లో ఉంటూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రుణ యాప్ ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్