చంద్రశేఖరపురం మండలంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఓ మోస్తారు వర్షం కురిసింది. ఇటీవల కాలంలో తీవ్ర ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో, ఎండ వేడిమికి అల్లాడిన ప్రజలు వర్షం కురవడంతో కొంత మేరకు ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ప్రజలు తెలిపారు.