కనిగిరి మండలం యడవల్లి, ఎర్ర ఓబనపల్లి, దిరుసవంచ, కమ్మవారిపల్లి, గ్రామాలలో కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరొకమారు ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమ పాలన కొనసాగుతుందని , ప్రజలందరికీ నేరుగా పథకాల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. జగనన్నకు అండగా నిలవాలని ప్రజలను కోరారు.