స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

58చూసినవారు
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం పాకాల సముద్రం బీచ్ లో బుధవారం నిర్వహించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రం బీచ్ లో చెత్తాచెదాలను స్థానిక యువకులతో కలిసి తొలగించారు. గాంధీ జయంతిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కర్ని మంత్రి స్వామి అభినందించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్