ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి

79చూసినవారు
ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి
ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో మంగళవారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఇంటింటికి తిరిగి పెన్షన్ దారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే పెంచిన పెన్షన్లను అందించారని మంత్రి స్వామి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని ఒక్కొక్కటిగా ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్