పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: మంత్రి

78చూసినవారు
పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: మంత్రి
జిల్లాలో శాంతి భద్రతలు విషయంలో లోపాలు ఉండకూడదని, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని జిల్లా మంత్రి డాక్టర్ డోలా బాలా వీరాంజనేయస్వామి జిల్లా ఎస్పీ గరుడ్ సమిత్ సునీల్ కు సూచించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి నివాసంలో డాక్టర్ డోలా బాలా వీరాంజనేయ స్వామిని జిల్లా ఎస్పీ గరుడ్ సమిత్ సునీల్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలపై ఎస్పీతో మంత్రి చర్చించారు.

సంబంధిత పోస్ట్