సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ అధికారులతో సంతనూతలపాడు ఆర్వో గోపాలకృష్ణ శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్లు ఈసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓట్ల. లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆర్వో పేర్కొన్నారు.