రాష్ట్రంలో సంక్షేమమే అజెండాగా జగన్ పరిపాలించాడని సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, రాష్ట్రమంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. హైదరాబాదులోని కేపీహెచ్ బీ కాలనీలో ఆదివారం సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలతో జరిగిన ఆత్మీయ సమయంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అందరూ వైసీపీకి అండగా నిలవాలని ఆయన కోరారు.