ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో తాను వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ ప్రకటించారు. తనకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు కానీ.. పొలిటికల్ పార్టీల నుంచి ఎవరైనా పిలిస్తే వెళ్లి ప్రచారం చేస్తానని అన్నారు. జనసేన నేతలు తనను ప్రచారానికి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని ఆమె తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు.