AP: సూపర్ సిక్స్ పేరుతో మహిళలను నట్టేట ముంచారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్పై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయని, చంద్రబాబు మోసాలపై రాష్ట్ర మహిళలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. రోజుకు 70 మంది మహిళలు, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని, జగన్ హయాంలో దిశా పీఎస్లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించామని గుర్తు చేశారు.