బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్: చంద్రబాబు

74చూసినవారు
బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్: చంద్రబాబు
సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫులే జయంతి సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. 'మేం అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తాం. రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా రూ.5 వేల కోట్ల విలువ చేసే పరికరాలను అందిస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి, పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం. పెళ్లి కానుక రూ.లక్షకు పెంచి ఇస్తాం' అని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్