AP: ఎల్పీజీ ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్ల సమ్మెతో రాష్ట్రంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్పీజీ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన కొత్త టెండర్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. దక్షిణ ప్రాంత బల్క్ ఎల్పీజీ ట్రాన్స్పోర్టర్లు ఈ నెల 27 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దాంతో తెలుగు రాష్ట్రాలకు ఎల్పీజీని రవాణా చేసే ట్రాన్స్పోర్టు లారీలు నిలిచిపోయాయి.