విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ ప్లస్ లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో
విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం
విద్యార్థులు ఉపాధ్యాయులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం 83. 33 నమోదయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెంచురామయ్య తెలిపారు.