నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ లో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అవ్వా, తాతలకు నెలకు 4 వేల రూపాయల పెన్షన్ నేరుగా ఇంటివద్దకు తెచ్చి అందిస్తారన్నారు.