గత ఐదారు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెట్లు చిగురించాయి. ఇటీవల కాలంలో తీవ్రమైన ఎండలకు చెట్లు ఎండిపోయాయి. దీంతో గేదెలు పశువులు మేత కోసం అల్లాడిపోతున్నాయి. ఒకవైపు మేత లేక మరోవైపు తాగడానికి నీరు లేక పశువులు నరకయాతన అనుభవిస్తానని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోస్తారు వర్షాలు కురవడంతో చెట్లు చిగురించడం సంతోషంగా ఉందని పశువుల కాపరులు తెలిపారు.